ఘనంగా నాయీబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన శంఖుస్థాపన
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామంలో నాయీబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన శంఖుస్థాపన ఘనంగా నిర్వహించారు . విద్యా , సంక్షేమ మౌళిక వసతుల అభివృద్ధి కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న నాయీబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనానికి రాష్ట్ర బిసి కమీషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథిగా హజరై శంఖుస్థాపన చేశారు .