Blog

Latest News
తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవ సంఘం ఆధ్వర్యంలో

తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవ సంఘం ఆధ్వర్యంలో

తెలంగాణరాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రబుత్వ పెద్దలను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, గౌ. శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని మరియు రాష్ట్ర భారీ నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మాత్యులు , గౌ.శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినీ మర్యాదపూర్వకంగా నేడు మంత్రి వారి ఆఫీసులో కలవడం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు గెజిట్ విడుదల చేయాలని కోరడం జరిగింది.నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

నాయి బ్రాహ్మణుల విద్యార్థులకు ఉపాధి రంగాలలో ప్రోత్సాహాలు కల్పించాలని కోరడం జరిగింది….  ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ శ్రీనివాసరావు గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరాల వెంకట స్వామి  గారు, తదితరులు పాల్గొన్నారు .

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *