నాయీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రులు కొండా సురేఖ, పోన్నంలకు వినతి
* తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను హైదరాబాద్ లో వారి స్వగృహం నందు తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం అధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న ఆధ్వర్యంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరాల వెంకటస్వామి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ శ్రీనివాసరావు వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త పెళ్లి శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలిపాక సతీష్ సంయుక్త కార్యదర్శి ఏలూరు రవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్ తదితరులు పాల్గొని మంత్రి కి తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు ఏదుర్కోంటున్న వివిధ సమస్యల మీద మరియు ఫెడరేషన్ ని కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. అనంతరం మంత్రి పోన్నం ప్రభాకర్ ని కలిసి తమ సమస్యలను విన్నవించారు.