శ్రీశైలం దేవస్థానం వారు కాణిపాకం దేవస్థానం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవం సందర్బంగా పట్టువస్త్రాలు సమర్పణ. మల్లుగళ్ల విజయలక్ష్మి సుబ్బరాయుడు శ్రీశైలం బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు మెంబర్, శ్రీశైలం సీతారామలక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానం ఎస్బీఐ కాలనీ నంద్యాల ఉడుమల్పురం దేవస్థానం ఆలయ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
పట్టు వస్త్రాలను తీసుకువస్తున్న శ్రీశైల దేవస్థానం ఈవో బోర్డు సభ్యులు
గురువారం ఉదయం శ్రీశైలం భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం నుంచి ఈఓ లవన్న బోర్డు సభ్యులు జగదీశ్వర్ రెడ్డి, మల్లుగళ్ల విజయలక్ష్మి సుబ్బరాయుడు పట్టు వస్త్రాలను తీసుకోచ్చారు. మధ్యాహ్నం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం నుంచి చైర్మన్ అంజురు శ్రీనివాసులు ఈఓ సాగర్ బాబు, బోర్డు సభ్యులు పట్టువత్రాలను తీసు కోచ్చారు. వారికి కాణిపాకం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి .ఈవో వెంకటేష్ పూర్ణకుంభ స్వాగతం పలికారు .వస్త్రాలను స్వామి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి ప్రత్యేక దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందించారు.వారు మాట్లాడుతూ పట్టువస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు